హైదరాబాద్, మహి న్యూస్ September 13
వినాయక చవితి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయమని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ అన్నారు.
పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారని, ఈ సమయంలో ప్రజలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే రవాణా సేవలు అందించాల్సిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని పేర్కొన్నారు.
పండుగ వేళ ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రత్యేక సర్వీసుల నిర్వహణతో పాటు అదనపు చార్జీల భారాన్ని తగ్గించి ప్రయాణికులకు ఊరట కల్పించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను పేరూరు బాలకృష్ణ కోరారు. ప్రజల నెత్తిన అదనపు భారం వేయకుండా పండుగ సమయంలో ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
0 Comments