Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో సత్తా చాటిన ఎల్లార్తి చంద్రశేఖర్

Share this Article:

కడప, జూలై 19 (మహి న్యూస్): దేశవ్యాప్తంగా నిర్వహించిన 21వ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (ఏఐబిఇ)లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ విద్యార్థి ఎల్లార్తి చంద్రశేఖర్ అర్హత సాధించి ప్రతిభ చాటుకున్నారు.

ఇటీవల విడుదలైన ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,75,701 మంది ఈ పరీక్షకు హాజరుకాగా, వారిలో 1,15,805 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,595 మంది పరీక్ష రాయగా, 962 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ కఠినమైన పోటీ పరీక్షలో విజయం సాధించడం పట్ల చంద్రశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “భవిష్యత్తులో సమర్థవంతమైన న్యాయవాదిగా రాణిస్తూ, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేయడమే నా లక్ష్యం. ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం నా వంతు బాధ్యతగా పోరాడుతాను” అని తెలిపారు.

ఈ విజయంతో ఎల్లార్తి చంద్రశేఖర్‌ను బంధుమిత్రులు, అధ్యాపకులు, సహచర విద్యార్థులు, శ్రేయోభిలాషులు అభినందిస్తూ, ఆయన న్యాయవృత్తిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/25

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X