Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

అన్నార్తులకు, వృద్ధులకు అతడొక అన్నం ముద్ద నిత్య అన్నదానంతో మానవత్వాన్ని చాటుతున్న ఈడుగురాల సురేష్ గౌడ్

Share this Article:

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మహి న్యూస్ జూలై 28

ఈ రోజుల్లో చాలామంది యువత తమ కుటుంబ భవిష్యత్తు, ఆర్థిక అభివృద్ధిపైనే దృష్టి సారిస్తుంటే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన ఈడుగురాల సురేష్ గౌడ్ మాత్రం సమాజ సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.

వ్యాపారం చేస్తూనే సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆయన, వృద్ధులు, వికలాంగులు, మతిస్థిమితం లేని నిరాశ్రయులకు అండగా నిలుస్తున్నారు. తోటి వారికి సహాయం చేయని జీవితం సార్థకం కాదనే భావనతో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ క్రమంలో **గూడెంలో “చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ”**ను స్థాపించి, సమీపంలోని కొండాపూర్ గ్రామంలో 16 మంది నిరుపేదలు, వృద్ధులకు ప్రతిరోజూ నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆకలితో ఉన్న వారికి భోజనం అందించడం ద్వారా నిజమైన మానవత్వాన్ని చాటుతున్నారు.

ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఈడుగురాల సురేష్ గౌడ్ మాట్లాడుతూ, “ఆకలితో ఉన్న వారి కడుపు నింపడంలో కలిగే ఆత్మసంతృప్తికి మించిన ఆనందం మరొకటి లేదు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేస్తే ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు” అని పేర్కొన్నారు.

సురేష్ గౌడ్ చేపడుతున్న ఈ నిత్య అన్నదాన సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు.

📰
Official Article Source Link
https://www.mahinewsindia.com/post/47
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X